
వార్డ్ కౌన్సిలర్ మా మోర ను అలకించండి
మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ప్రధాన రహదారిపై గుంత తవ్వి మరిచిన అధికారులు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
వాహనా దారులు, మరియు ఆటోలు మరియు సైకిల్ పై వెళ్తున్న చిన్న పిల్లల ప్రమాదాలకు కారకులు ఎవరు?
సి కె న్యూస్ ప్రతినిది
గద్వాల పట్టణం:- గద్వాల పట్టణ కేంద్రంలోని 16వ వార్డు ఉన్న నవరంగ్ టాకిష్ వెళ్లే ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ వేయడం కోసం రోడ్డును తవ్వేశారు. కానీ పైప్ లైన్ వేయలేదు గుంత పూడ్చలేదు.
ఆ రోడ్డుపై ఆ గుంత ఉండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురై కింద పడిపోతున్నారు. సైకిల్ లపై వెళ్తున్న విద్యార్థులు కూడా కింద పడడం జరుగుతున్నది.
కావున 16వ వార్డ్ కౌన్సిలర్ స్పందించి.. వచ్చిపోయే వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా మిషన్ భగీరథ పైప్లైన్ వేసి త్వరగా రోడ్డును పూడ్చాలని వాహనదారులు కోరుకుంటున్నారు లేకపోతే ఆ రోడ్డుని పూర్తిగా మట్టి వేసి కప్పి పైప్లైన్ వేసేటప్పుడు మరి మట్టిని తొలగించి పైప్లైన్ వేయగలరని కాలనీవాసులు మరియు వాహనదారులు కౌన్సిలర్ ని కోరుకుంటున్నారు.




