ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి;

By :  Ck News Tv
Update: 2025-03-09 05:37 GMT

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలంలో గల జందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సంఘటనలో ఇద్దరు మరణించగా సంఘటన స్థలాన్ని ఉదయం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హుట హుటిన వెళ్లి పరిశీలించారు.

ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ (Adilabad) వైపు నుంచి మహారాష్ట్ర వెైపు వెళ్తున్న డీసీఎం లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్, అదనపు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్ర మత్తే కారణమా?

జందాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ప్రదీప్ సాహు, లోచన్ సాహు అనే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారని తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Similar News