Khammam

ఇల్లందు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఇల్లందు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఇల్లందు ప్రజా ప్రశ్నించే గొంతుక
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

సికె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండల ప్రతినిధి ( పబ్బు సురేష్ ) :-

ఫిబ్రవరి 2

ఇల్లందులో ఆదివారం రోజున జరిగిన ప్రజా ప్రశ్నించే గొంతుక ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు ప్రెస్ క్లబ్ లో జరిగినవి . ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ (సాక్షి శ్రీ దినపత్రిక స్టేట్ డైరెక్టర్). ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస చారి, ఉపాధ్యక్షులుగా కడారి నటరాజ్, ఎస్ శశికుమార్, కార్యదర్శిగా జహారాభి, సహాయ కార్యదర్శులుగా రాజశేఖర్, మనోజ్, ప్రచార కార్యదర్శిగా షేక్ సలీం, కోశాధికారిగా కాపు సురేష్ బాబు, ప్రెస్ క్లబ్ ఇన్చార్జిగా పబ్బు శివ లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రారెడ్డి మరియు జర్నలిస్ట్ కపిల్ పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button