KhammamManchiryalaPoliticalTelangana

నానమ్మ , మనవరాలు అనుమానస్పద మృతి !

నానమ్మ , మనవరాలు అనుమానస్పద మృతి !

నానమ్మ , మనవరాలు అనుమానస్పద మృతి !

మంచిర్యాలలో పట్టణంలో నానమ్మ , మనవరాలు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జాల సత్యవతి (54) అనే మహిళకు ఇద్దరు కుమారులు. ఒకరు హిజ్రాగా మారారు. పట్టణంలో గోపాలవాడలో ఇంటి నిర్మించుకుని నివాసముంటు కొంతకాలం క్రితం అతడు మృతి చెందాడు.

అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉండడంతో దానిని అమ్మడానికి తల్లి సత్యవతితో కలిసి కొడుకు గంగోత్రి , మనవరాలు గీతా శిరీష (4) ముగ్గురు కలిసి మూడు రోజుల క్రితం ఖమ్మం నుంచి మంచిర్యాలకు వచ్చారు.

రెండు రోజుల క్రితం కొడుకు గంగోత్రికి ఆస్తమా సమస్య రావడంతో తిరిగి ఖమ్మంకు వెళ్లిపోయాడు. ఖమ్మం వెళ్లిన కొడుకు బుధవారం తల్లికి ఫోన్ చేయగా తీయకపోవడంతో ఇంటి పక్కన వారికి సమాచారం అందించి పరిశీలించాలని కోరాడు.

లోపలికి తలుపులు గడియ పెట్టి ఉండడంతో, ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button