
రేషన్ బియ్యం పట్టివేత,సన్న బియ్యం సైతం అన్యాక్రాంతం
పేదలకు ఇచ్చే సన్న బియ్యం వదలని దళారులు
పకడ్బందీగ దుకాణాలు దాటిస్తున్న మధ్య వర్తులు
సీకే న్యూస్ నల్గొండ జూన్ 20
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగ ప్రవేశపెట్టినటువంటి పేదల కడుపు నింపడానికి చౌకదారుల దుకాణం ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సదరు రేషన్ డీలర్లు దుర్వినియోగం చేస్తున్నారు.
వివరాల్లోకెళితే విశ్వసనీయ సమాచారం మేరకు జూన్(17)బుధవారం తెల్లవారుజామున వేములపల్లి మండలం మోల్కపట్నం గ్రామం నుండి సుమారు 30 క్వింటాళ్ల (పిడిఎస్)సన్నబియ్యం సరాసరి ప్రభుత్వ గోనెసంచులలో మధ్య దళారులు
టాటా ఏసీ లో తరలిస్తున్నారని తెలియడంతో స్థానిక పోలీస్ వారు “టాటా ఏసీ పిడిఎస్”బియ్యన్ని స్వాధీన పరుచుకున్నారు
దీనిపై స్థానిక ఎస్సై డి.వెంకటేశ్వర్లు ను వివరాలు అడగగ పిడిఎస్ రవాణా చేస్తున్న”టాటా ఏసీ ని”స్వాదినపరుచుకున్నట్టు దీనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు