
హత్య కేను కొట్టేసిన జిల్లా కోర్టు
నిందితుని తరపు న్యాయవాదిగా పూన మానన
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం నగరంలో 2023లో నంచలనంగా మారిన హత్యకేసులో ఖమ్మం ఫ్యామిలీ కోర్టు తన తీర్పు వెలువరించింది.
ఈ కేనులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొక్క కోటయ్య పై నేరం రుజువు కానందున కోర్టు అతనిని నిర్దోషిగా తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకు చెందిన రేణుకకు, నేలకొండపల్లి మండలం మొక్క కోటయ్యతో వివాహం జరిగింది.
వీరిరువురూ ఖమ్మం నగరం మామిళ్లగూడెంలో నివాసం ఉంటున్నారు. రేణుకకు తల్లి గారి నుంచి పనుపు కుంకుమల కింద కొంత ఆస్థి సంక్రమించింది.
ఈ ఆస్థికి సంబంధించి కొంత వివాదం ఉందని, దాని కారణంగానే తన అక్కను మొక్క కోటయ్య ఉరివేసి చంపాడని ఆరోపిస్తూ రేణుక తమ్ముడు సిలివేరు అబ్బులయ్య టూ టౌన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు పలువురు సాక్షులను విచారించింది.

ప్రాసిక్యూషన్ కేనును రుజువు చేయకపోవడంతో, నిందితుడు నిర్దోషి అని ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి తీర్పు చెప్పారు. నిందితుని తరపు న్యాయవాదిగా పూన మానన వ్యవహరించారు.
చిన్న వయనులో హత్య కేసును వాదించి తన ప్రతిభ కనబరిచినందుకు పలువురు సీనియర్ న్యాయవాదులు పూన మాననను అభినందించారు.