EducationHyderabadPoliticalTelangana

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్... గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రద్దు...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్... గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రద్దు...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

గ్రూప్‌1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

గతంలో ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ రద్దు

గ్రూప్‌1 మెయిన్స్‌ ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు

మెయిన్స్‌ పేపర్లను రీవాల్యుయేషన్‌ చేయాలని ఆదేశం

రీవాల్యుయేషన్‌ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని..

టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న కోర్టు

టీజీపీఎస్సీకి 8 నెలల డెడ్‌లైన్‌ విధించిన హైకోర్టు

8 నెలల్లో రీవాల్యుయేషన్‌ చేయాలి..

లేదా మళ్లీ పరీక్షలైనా నిర్వహించాలన్న హైకోర్టు

గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం పై హైకోర్టు సంచలన తీర్పు!


జనరల్ ర్యాకింగ్ రద్దు?

హైదరాబాద్:సెప్టెంబర్ 09
గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది గతంలో ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.మెయిన్స్‌ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది.

గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకనం లో అవకతవకలు జరిగాయని పరీక్షలను రద్దు చేయి చేయాలని కోరుతూ.. కొందరు వేరువేరుగా పిటిషన్లను దాఖలు చేశారు వీటన్నిటిని ఒకటిగా విచారించిన హైకోర్టు జూలై 7న వాదనలు తీర్పును రిజర్వ్ చేసింది..

విచారించిన హైకోర్టు రీవాల్యుయేషన్‌ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. పునఃమూ ల్యాంకనం సాధ్యం కాకపోతే ఎనిమిది నెలల్లో మళ్లీ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయింది.

2023 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.

పరీక్షల్లో జెల్‌ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్‌ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు తన తీర్పును వాయిదా వేస్తున్నట్టు జూలై 7న ప్రకటించారు. తాజాగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రీవాల్యు యేషన్‌ జరిపించాలని టీజీపీఎస్సీని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!