Andhra Pradesh

పెళ్ళికి ఒప్పుకోలేదని నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..! తర్వాత..

పెళ్ళికి ఒప్పుకోలేదని నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..! తర్వాత..

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరులోని సత్రంపాడులో ప్రేమోన్మాది.. తాను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు.
యువతి గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని ఎమ్మెర్సీ కాలనీకి చెందిన రత్న గ్రేస్ (27)గా గుర్తించారు.

గ్రేస్ పై కత్తితో దాడి చేసిన అనంతరం ఏసురత్నం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏసురత్నం ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఏసురత్నంది ముసునూరు గ్రామమని పోలీసులు తెలిపారు.

కాగా.. ఏసురత్నం 10వ తరగతి నుంచి తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించింది. మూడురోజుల క్రితమే రత్నగ్రేస్ కు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఒకసారి మాట్లాడాలని పిలిచిన ఏసురత్నం.. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే కత్తితో నరికి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం.. వాళ్లిద్దరూ ఏడాదిన్నర కాలంగా కలిసి బయటకు వెళ్తున్నారని మీడియాకు తెలిపారు.

రత్నగ్రేస్ స్థానికంగా ఉన్న సిద్ధార్థ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు ఘటనా స్థలంలో కొత్త చీర సహా ఇతర పెళ్లి సామాగ్రి లభించినట్లు తెలుస్తోంది.

రత్నగ్రేస్ మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి ముద్దయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button