KhammamTelangana

తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్య

తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్య

తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్య

సికె న్యూస్

కారేపల్లి మండలం కొత్తూరుతండాకు చెందిన ఇంటర్‌ చదువుతున్న విద్యార్ధి ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తల్లి దండ్రులు మందలించారు.

దీంతో మనస్థాపం చెందిన బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కారేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరుతండాకు చెందిన బానోత్‌ మహేశ్వరి(17) ఖమ్మంలోని ఉమెన్స్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి మహేశ్వరి పండగ అనంతరం కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంది. దీంతో మంగళవారం తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్ద ఎందుకు ఉంటున్నావని మందలించారు.

అనంతరం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. దాంతో ఇంట్లో చీరతో ఊరేసుకుంది. దీనిని గమనించిన చట్టుపక్కల వారైన అజ్మీర బిక్కు, మాంగిణిలు అక్కడికి చేరుకొని మహేశ్వరిని కిందికి దింపగా అప్పటికే మృతి చెందింది.

మృతురాలి తండ్రి బానోత్‌ ఈర్యా ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్పై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button