
లంచం తీసుకుంటు ACB కి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి…
మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..బొగ్గు ఉత్పత్తి కోసం NOC జారీ చేయడానికి పెన్ పహాడ్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పిన బాధితులు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పంచాయతీ ఆఫీస్కు వచ్చాడు.
సరిగ్గా లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. సతీష్ కుమార్ను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.