
కోకాపేట్లో దారుణం.. భర్తను హతమార్చిన భార్య
హైదరాబాద్ కోకాపేట్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. అస్సాంకు చెందిన భార్య భర్తలు కోకాపేటలో నివాసం ఉంటున్నారు.
అయితే గురువారం రాత్రి దంపతుల మధ్య విపరీతమైన గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశంతో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. దీంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతని కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
కాగా తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అస్సాంకు చెందిన భార్యభర్తలు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా బతకుతెరువు కోసం అస్సాం నుంచి హైదరాబాద్కు వచ్చారు.
కొకాపేట్లో ఉంటూ స్థానికంగా కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త కృష్ణ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో గత అర్ధరాత్రి కూడా చిన్న విషయానికి భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడ్డారు.
చివరకు భర్త వేధింపులు తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన భార్య.. అతడిపై కూరగాయల కత్తితో దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. భరత్ కేకలు విన్న స్థానికులు ఇంటిలోపలికి వచ్చి చూడగా భర్త రక్తపుమడుగులో పడి ఉన్నాడు.
వెంటనే భర్తను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.