
ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టిన కంటైనర్
మిర్యాలగూడ: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్లను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హుటా హుటిన పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫిబ్రవరి 4న సీఎం సభ నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఫిబ్రవరి 4న మిర్యాలగూడ మండలం గూడురు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంది. సీఎం టూర్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.



