
HRC ఎదుట మహిళ ఆత్మ*హత్యాయత్నం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి వద్ద ఉన్న మానవ హక్కుల కమిషన్ (HRC) కార్యాలయం ఎదుట సోమవారం కలకలం రేగింది.
గాంధీనగర్ పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కవాడిగూడకు చెందిన శ్రావణి అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
శ్రావణి పెట్రోల్ పోసుకుంటుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే గమనించి ఆమెను అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే న్యాయం కోసం కమిషన్ కార్యాలయానికి వచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.




