
పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మ*హత్యాయత్నం
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వైన్ షాపు సమీపంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన కాసిన గొట్టు భారతి అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మ*హత్యాయత్నానికి పాల్పడింది.
కరీంనగర్కు చెందిన కాసిన గొట్టు భారతి అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రామడుగు ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాయపడిన మహిళను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి చేరుకున్న తరువాత కూడా ఎస్ఐ రాజు తన బాధ్యతను చూపుతూ, స్ట్రెచర్పై ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లడం గమనార్హం.
ప్రస్తుతం గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.



