HyderabadPoliticalTelangana

మంత్రి కొండా సురేఖ మాజీ OSDపై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ OSDపై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ OSDపై హత్యాయత్నం కేసు

Web desc : మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో తీవ్రమైన నేరారోపణలతో కేసు నమోదైంది. బాధితుడు గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమంత్ తన అనుచరులతో కలిసి రాడ్లతో దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హత్యాయత్నం చేసే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లు ఫిర్యాదుదారుడు వివరించారు. దీని ఆధారంగా మేడిపల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 అంటే.. హత్యాయత్నం కింద సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

జీరో ఎఫ్‌ఐఆర్ – జూబ్లీహిల్స్‌కు బదిలీ : సంఘటన జరిగిన పరిధి లేదా ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా స్పందించిన మేడిపల్లి పోలీసులు ముందుగా ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేశారు.

అనంతరం ఘటన జరిగిన అసలు ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో, కేసుకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను తదుపరి దర్యాప్తు నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఇదివరకే పలు అవినీతి, వసూళ్ల ఆరోపణలతో ప్రభుత్వం సుమంత్‌ను OSD బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హత్యాయత్నం కేసు కూడా నమోదవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button