HealthHyderabadPoliticalTelangana

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా.. మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా.. మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా.. మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో పోలీసులు డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. కొంపల్లి కేంద్రంగా విక్రయాలు సాగిస్తున్న అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా, ఈ రాకెట్‌కు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ సూత్రధారిగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి జయభేరి పార్క్ సమీపంలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, కొనుగోలు, అమ్మకాలు జరుపుతున్న ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 లక్షల విలువ చేసే సుమారు 1.9 కిలోల ‘అల్ఫ్రాజోలం’ డ్రగ్‌ను సీజ్ చేశారు. డ్రగ్స్‌తో పాటు రూ.40,000 నగదు, ఒక కారు, ఒక బైక్ మరియు పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు గొల్ల రమేశ్ అనే మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నిందితుడు రమేశ్‌పై ఇప్పటికే గడచిన కాలంలో మూడు ఎన్డీపీఎస్ (NDPS) కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డి ప్రాంతం నుంచి అల్ఫ్రాజోలం డ్రగ్‌ను అక్రమంగా తీసుకువచ్చి, కొంపల్లి మరియు కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button