HyderabadPoliticalTelangana

అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?

అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?

అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?

హైదరాబాద్ : బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ శాసనసభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టివేసిందని ఆరోపించారు. శాసనసభలో సోమవారం రోజున పద్దులపై చర్చ సందర్బంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.

తమ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని.. అలాంటిది సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శలు సరికాదని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం నిర్వీర్యం అయిందని.. ఆ సమయంలో జరిగిన తప్పులను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం..

జనాభా ప్రాతిపదికన కాకుండా తెలంగాణ అవసరాల మేరకు అదనపు విద్యుత్ కేటాయించిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. యాదాద్రి పవన్ ప్లాంట్ లాభదాయకం కాదని తాను గతంలోనే చెప్పానని తెలిపారు.

”మీ నాయకుడు రాలేదని అడిగితే.. మీ స్థాయికి ఆయన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ల స్థాయి ఏమిటో అందరికి తెలిసిందే.. వాళ్లకు కనీసం అపాయింట్‌మెంట్ ఇచ్చిండా?. వాళ్లు చెప్పే మాటలను కూడా ఆయన వినేవాడు కాదు.

ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. ముఖ్యమైన అంశాల మీద చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకుంటే, మరి ప్రతిపక్ష నేతగా ఎందుకు ఉండాలి?. ఆయన అవసరం లేదని అంటున్నప్పుడు.. వాళ్లలో ఎవరో ఒకరు ప్రతిపక్ష నేత కావాలి.

ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి..” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం నుంచి తాము మంచి చేసే సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. అయితే ప్రతిపక్షం మీడియా ముందు తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు.. తమకు మైక్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఏదైనా సమస్య గురించి ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే.. మైక్ కట్ చేసేవారని చెప్పారు. కొన్నిసార్లు అయితే తనను కొట్టేందుకే వచ్చారని అన్నారు.

వంద మంది కౌరవుల మాదిరిగా తనను కొట్టేందుకు వచ్చారని.. వారి (బీఆర్ఎస్)హయాంలో జరిగిన దుర్మార్గమైన పాలనను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు ఈ ప్రాంత ప్రజల కల సాకారమైందని భావించామని.. బీఆర్ఎస్ పాలనలో ఇంత నాశనం అయితదని అనుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button