సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్;
బిగ్ బ్రేకింగ్...
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్
నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సినిమా నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
మొదట్లో టీడీపీకి సానుభూతిపరుడిగా ఉండే వారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత సైలెంట్ గా ఉన్నారు.
వైసీపీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన జగన్తో ట్రావెల్ చేశారు. 2019 కంటే ముందు నుంచి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీంతో ఆయన అనేక కేసుల్లో చిక్కుకున్నారు.
వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడటంతోపాటు బూతులతో రెచ్చిపోయే వాళ్లు.
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలో నమోదు అయిన కేసు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు పోసాని కృష్ణ మురళిని రాత్రి 8.45 నిమిషాలకు అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్టు తెలిపారు. కులాల పేరుతో దూషించి ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించినందుకు ఆయన్ని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఆయనపై 196, 353(2),111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ ను ఇష్టారీతిన తిట్టడంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్లను టార్గెట్ చేసుకొని మాట్లాడారు.
సన్నిహితుల సలహా మేరకు ఈ మధ్య కాలంలోనే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తానంటూ ప్రకటించారు. గతంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో ఆయన్ని అరెస్టు చేశారు.