మా భవిష్యత్ ను కాపాడే వారెవరు?
రిలే నిరాహారదీక్ష చేపట్టిన పిల్లలు;
By : Ck News Tv
Update: 2025-02-27 05:59 GMT
*మా భవిష్యత్ ను కాపాడే వారెవరు?*
*రిలే నిరాహారదీక్ష చేపట్టిన పిల్లలు*
సింగరేణి కాలుష్యం పై పోరాడుతున్న కిష్టారం అంబేడ్కర్ నగర్ వాసుల 17 వ రోజు రిలే దీక్షలో పిల్లల వంతు వచ్చింది. శివరాత్రి పర్వదినం సెలవు కావడంతో కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ కాలనీని రక్షించుకునేందుకు వారి వంతుగా పోరాటానికి సిద్ధపడ్డారు.
సింగరేణి తమ సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మారోజు శ్రీను, పాలకుర్తి నాగేశ్వరరావు, మారోజు నాగేశ్వరరావు, కడారి మదీనా, పాలకుర్తి రాజు, పాలకుర్తి ప్రభుదాసు, పాలకుర్తి ప్రభాకర్, వాడపల్లి కోటేశ్వరరావు, కిష్టపాటి కోటిరెడ్డి, కొత్త సాంబయ్య, రాజిని చంద్రం, కొండ నాగరత్నం గ్రామస్తులు పాల్గొన్నారు.