మందకృష్ణ నా కంటే ఎక్కువ వాళ్లనే నమ్ముతుండు..

మందకృష్ణ నా కంటే ఎక్కువ వాళ్లనే నమ్ముతుండు..;

By :  Ck News Tv
Update: 2025-03-20 03:44 GMT

మందకృష్ణ నా కంటే ఎక్కువ వాళ్లనే నమ్ముతుండు..

CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తో విభేదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత అనుబంధం బాగుందని అన్నారు.

కానీ.. ఒక విషయంలో బాధగా ఉంది.. నా కంటే ఎక్కువ ప్రధాని మోడీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే మందకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారు అని అన్నారు.

దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం లేదు.. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పక్కా ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నాం.. వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చే వరకు ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వొద్దని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Full View

'రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాం.

వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేసింది కాదు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం.

ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశాం' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

'ముఖ్యమంత్రి కుర్చీలో నేను మీ వాడిగా కూర్చున్నాను. మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి' అని సూచించారు.

Similar News