దాతృత్వం చాటుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి
అనారోగ్యంతో బాధపడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఊదరి సంజీవ కు 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేత
సికె న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి ( శ్రీనివాస్) డిసెంబర్ 25
చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఊదరి సంజీవ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఇట్టి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి ఏనుగు రవీందర్ రెడ్డి మానవతా దృక్పథంతో 5000వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ధర్మోజి గూడెం గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ధర్మోజిగూడెం గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఉపసర్పంచ్ బత్తుల శ్రీహరి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు డాకోజి సతీష్, ఐతరాజు శ్రీకాంత్, జంగం సందీప్ ఊదరి రాజ్ కుమార్, ఊదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు