ఈ కేవైసీ పేరుతో కొత్త రకం దోపిడి
సీ కే న్యూస్ ప్రతినిధి / వీపనగండ్ల :
సిలిండర్ ఇంటికి చేరాలంటే చెయ్యి తడపాల్సిందే
ఈ కేవైసీ కొరకు 200 కట్టాల్సిందే
వీపనగండ్ల ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అక్రమ దోపిడి
కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీకి 200 కట్టమని చెప్పిందా..?
కనీసం త్రాగు నీటి సదుపాయం కూడా కల్పించని డిస్ట్రిబ్యూటర్
ఆకలి దప్పికలకు అల్లాడుతున్న ఇతర గ్రామస్తులు
సీ కె న్యూస్ ప్రతినిధి సులిగిరి తరుణ్ జర్నలిస్ట్
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో 500 సిలిండర్ కొరకు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు కి ఉచితంగా ఈ కేవైసీ చేయాల్సి ఉండగా , కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పటంతో మండలంలోని 8 వేలగ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు
ఈ కేవైసీ కొరకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ వద్ద బారులు తీరి ఉంటున్నారు, ప్రతి గ్రామాలలో గ్యాస్ డెలివరీ బాయ్స్ ఈ కేవైసీ కూడా చేయాల్సి ఉండగా నిబంధనలు వారు పాటించటం లేదు. ఈ కేవైసీ చేయటానికి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తమకు ఆప్షన్ ఇవ్వలేదని, ప్రతి లబ్ధిదారుడు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఈ కేవైసీ చేయించుకోవాలని సమాధానం చెబుతున్నారు.
వీపనగండ్ల మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ కేవైసీ పేరుతో సురక్ష పైపును అధిక రేటుకు అంటగడుతూ దోపిడీకి పాల్పడుతున్నారని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు వాపోతున్నారు ఇక్కడ నీటి సౌకర్యం కూడా లేదని లబ్ధిదారులు అంటున్నారు.
ఈ కేవైసీ చేయించుకోవడానికి వచ్చిన ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు ఈ కేవైసీని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు లబ్ధిదారులకు ఉచితంగా చేయవలసి ఉండగా గ్యాస్ పైపును (సురక్షిత పైపు) తీసుకుంటేనే ఈ కేవైసీ చేస్తామని చెప్తున్నాడని తప్పని పరిస్థితుల్లో పైపులు కొని ఈకేవైసీ చేయించుకుంటున్నామని వాపోతున్నారు. ఇండియన్ గ్యాస్ డీలర్ 190 రూపాయలకు లబ్ధిదారులకు బలవంతంగా అంటగడుతున్నాడని, పైపును తీసుకోకపోతే ఈకేవైసీ చేయటం లేదని గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు వాపోతున్నారు.
ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ను అధిక రేటుకు అమ్ముతున్నారని, విషయాన్ని పలుమార్లు జిల్లా అధికారులకు, స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిపిన పట్టించుకోవటం లేదని పలువురు లబ్ధిదారులు వాపోయారు.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు డీలరే ఉచితంగా గ్యాస్ ను సరఫరా చేయాల్సి ఉండగా ఒక్కో సిలిండర్ పై 30 నుంచి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోయారు,
ఈ విషయం గురించి పలుమార్లు నిలదీస్తే మీ ఇష్టం ఉన్నవారికి చెప్పుకోండి అంటూ సమాధానం చెబుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఈ కేవైసీ దోపిడీని అరికట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.