![](https://cknewstv.in/wp-content/uploads/2024/01/n57248947017047711607524adf80ab4be611a1c105c5fc58c6617b56c95c596a755f6b084be38464095d0c.jpg)
పోలీసుల పై చేయి చేసుకున్న యువకులు
నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసుల పై మద్యం మత్తులో ఉన్న యువకులు చేయి చేసుకున్నారు.
ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నాందేవ్ వాడ చౌరస్తాలో జరిగింది.
నిజామాబాద్ మూడవ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కసబ్ గల్లికి చెందిన ఇద్ధరు యువకులు బైక్ పై వస్తుండగా పోలీసులు వారిని నిలిపి బ్రీత్ ఎన్ లైజర్ ద్వారా పరీక్షించేందుకు యత్నించారు.
దానితో మత్తు కిక్కు లో ఉన్నవారు ఏకంగా ఎస్ఐ 2తో పాటు ఒక కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అక్కడ గోడవ సద్ధుమణిగిపించి పోలీసులపై చేయి చేసుకున్న ఇద్దరు యువకులను కారులో స్టేషన్కు తరలించారు.