KhammamPoliticalTelangana

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా మంత్రి పొంగులేటి

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా మంత్రి పొంగులేటి

హెూండా పై పొంగులేటి… స్కూటీలో ఆర్ ఆర్ ఆర్

– ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

– బాధితులకు అండగా ఉంటామని భరోసా

బాధితుల పరమర్శలో మంత్రి కి స్వల్ప గాయాలు

ఖమ్మం రూరల్ : హెండా యూనికార్న్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నడుపుతూ…. స్కూటీలో ఆర్ ఆర్ ఆర్ వెనకాల కూర్చుని ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు.

మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు.

బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు వారి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఖచ్చితంగా బాధితులందరినీ ఆదుకుంటామని, ఏ ఒక్కరికి ఇబ్బందులు కలిగించబోమని మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

మ్మం: మున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి.

బైక్‌పై తిరుగుతూ..ప్రమాదవశాత్తూ కిందపడ్డారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.ఆయన ఆరోగ్యవ నిలకడగా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button