
వనపర్తి , గద్వాల జిల్లాల రద్దు తో కుటీల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
సీ కే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:
ఎంపీ ఎలక్షన్లో “ఆర్ఎస్పీ” కి కలిసొస్తున్న “గద్వాల , వనపర్తి” జిల్లా ప్రాంత వాసులు
వనపర్తి, జోగులాంబ జిల్లాల రద్దు తప్పదా..?
జిల్లాల రద్దుతో కేసీఆర్ వైపు చూస్తున్న జనం
ఆందోళనలో గద్వాల, వనపర్తి జిల్లాల ప్రజలు
గద్వాల లో జరిగిన రాహుల్ గాంధీ సభ కు హాజరుకాని కాంగ్రెస్ లీడర్లు
వనపర్తి గద్వాల్ జిల్లాలు రద్దయితే పని చేయమంటున్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ లీడర్స్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రాంతంలో విద్యాభివృద్ధి జరగాలంటే …, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలి
నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో విద్యాభివృద్ధి జరగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని ఈ ప్రాంతం మేధావులు పిలుపునిస్తున్నారు.
జోగులాంబ(గద్వాల) జిల్లా వనపర్తి జిల్లాలు రద్దు తప్పదా…? అంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆ రెండు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రద్దుకు ఏర్పాటు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గద్వాల జిల్లా నీ మహబూబ్నగర్లో వనపర్తి ని నాగర్ కర్నూల్ జిల్లాలో కలిపి ఉండే విధంగా జిల్లాలో ఏర్పాటు జరుగుతున్నదని వస్తున్న వార్తల పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇలా అయితే మేము ఎలా జీవనం కొనసాగించాలి అంటూ వారు తలబాదుకుంటున్నారు వ్యాపారవేత్తలు ఎన్నో టెన్షన్లకు గురవుతున్నారు ఈనెల 5న గద్వాలలో జరిగే రాహుల్ గాంధీ సభకు ప్రజలు ఆయా ప్రాంతాల రైతులు,కూలీలు భారీగా తరలి వెళ్తారన్న నమ్మకం లేకుండా పోతుందన్న అంశాలు చూస్తుంటే సభకు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయని, వద్దంతులు వస్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి జిల్లా రద్దు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ,లీడర్లు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఇబ్బంది కలుగుతుందని కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు విచిత్ర, వింత నిర్ణయాల పట్ల ప్రజలే కాదు కార్యకర్తలు కూడా మదన పడుతున్నారు.
దీనితో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉందని, అందుకే బీఆర్ఎస్ పార్టీ దూసుకు వెళుతున్నదని, గ్రామాలలో ప్రజలు అంటున్నారు. అందుకే గత రెండు మూడు రోజులుగా గ్రామాలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నారు.
గ్రామాలలో ప్రజలలో వద్దంతులు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యాభివృద్ధి కోసం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా గురుకుల పాఠశాల ఏర్పాటుచేసి ప్రజల మన్ననలు పొందారు. అదే విధంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో తనకు గ్రామాలలో మద్దతు పెరుగుతున్నది.
అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు కెసిఆర్ అవసరము అని ప్రజలు భావిస్తున్నారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ప్రతిపక్షం పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నది.తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రక్షణ కౌశంగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు.
ఏది ఏమైనా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలలో ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. దీన్ని బట్టి చూస్తే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు మెండుగా ఉన్నదని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.గతంలో ఉన్న నాయకులు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేవని, ఏ పని కూడా ప్రజలకు కనిపించే విధంగా ఇక్కడ జరగలేదన్న వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
అధికార పార్టీ తమ అధికారబలంతో గ్రామాలలో ప్రజలపై కార్యకర్తలపై జూలం జరుపుతూ తమ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని ఆ పార్టీ అధినేతలు ఆదేశిస్తున్నారు. అయినా కూడా ఎన్నికల ప్రచార రథం తప్ప ప్రచారంలో నాయకులు కనబడడం లేదు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందిగా కలుగుతున్నదని, ఈ ప్రాంత వాసులు, మేధావులు తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.
అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు… నోరు విప్పని రేవంత్
వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ రెండు జిల్లాల రద్దుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో నిరాశ కనిపిస్తుంది ఎందుకంటే ఈ జిల్లాలు రద్దు అయితే వ్యాపారవేత్తలు మరియు లీడర్లు పూర్తిస్థాయిలో వారి మనుగడకు వెన్ను పోటు పొడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
ప్రస్తుతం వారికి ఒకటే ఆధారం ఆ రెండు జిల్లాలు రద్దు కాకూడదంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన ఈ రెండు జిల్లాలు కేవలం ఆయన ద్వారానే రద్దు కాకుండా ఉంటాయని వారు నిర్ణయం తీసుకుంటున్నట్లు పూర్తి స్థాయిలో కనిపిస్తుంది
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకుంటేనే ఆ జిల్లాల రద్దు అనే విషయం పై ఆయన పోరాడుతాడని వారికి వారు ఊహాగానాలు రేకెత్తించుకుంటున్నారు
ఆయన ద్వారానే మా జిల్లాలు మాకు రద్దు కాకుండా ఉంటాయని వారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పూర్తిస్థాయిలో ఆయనను ఎంపీగా గెలిపించుకోవాలని ఆయనపై ఎక్కువ మొత్తంలో మొగ్గుచూపుతున్నారు
ప్రజల్లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్న విషయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసినప్పటికీ నోరు విప్పకుండా ఏమి తెలియనట్లు ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సీఎంతో మాకు సంబంధం లేనట్టుగా వారీ తీరు కనిపిస్తున్నట్లు సమాచారం