
నాంపల్లి రైల్వేస్టేషన్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం…
Web desc : హైదరాబాద్- జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై రైలు ఆగి ఉంది.
ఫైర్ సిబ్బందితో కలసి మంటలను ఆర్పిన హైడ్రా DRF సిబ్బంది. రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6. 20 గంటల ప్రాంతంలో మంటలంటుకున్న బోగీలు.
ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏమి కాలేదు. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం మంటలను అదుపులోకి తెచ్చారు. బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.




