
ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది
10 ఏండ్లు అధికారంలో ఉండి ములుగు జిల్లాకు ఒక్క వెయ్యి ఇండ్లు కూడా ఇవ్వలేదు
ప్రజా ప్రభుత్వం రాగానే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసినం
అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.
ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం.
అభివృద్ధి చేయడమే మా లక్ష్యం
చర్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు స్థానిక ఏ మ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మరియు ఎంపీ బలరాం నాయకు తో కలిసి అందించిన మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని, అర్హులందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో మొదటి దఫాగా ప్రతి నియోజకవర్గానికి ఐదువేల ఇండ్లను కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని వెనుకబడిన ములుగు జిల్లా ను స్థానిక ఏమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో కలిసి అభివృద్ధి చెయ్యడం జరిగింది అని రెండో విడతలో ఇంకా ఇండ్లు లేని పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దని మంత్రి అన్నారు
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, నేడు మంత్రి సీతక్కతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు