
కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థిని ఆత్మ*హత్యాయత్నం
Web desc : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బొల్లెపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగుచూసింది.
పాఠశాలలోని సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెంది ఆదివారం ఉదయం 16 ఐరన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.
తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బంది గమనించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గురుకుల పాఠశాలలో లోపించిన అధికారుల పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.




