NizamabadPoliticalTelangana

బిడ్డ పెళ్లైన కొన్ని గంటలకే తండ్రి హటాత్మరణం...

బిడ్డ పెళ్లైన కొన్ని గంటలకే తండ్రి హటాత్మరణం...

బిడ్డ పెళ్లైన కొన్ని గంటలకే తండ్రి హటాత్మరణం…

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని నందిగామ గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తన కన్న బిడ్డ పెళ్లి కోసం, తాను ప్రాణప్రదంగా పెంచుకున్న మూగ జీవాలను అమ్ముకోవాల్సి వచ్చిందన్న బాధతో ఓ రైతు తనువు చాలించాడు.

నందిగామ గ్రామానికి చెందిన దేవన్న అనే వ్యక్తికి సుమారు వందకు పైగా మేకలు ఉండేవి. వాటిని అతను కేవలం పశువుల్లా కాకుండా, తన సొంత బిడ్డల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.

ఇటీవల తన కుమార్తె వివాహం నిశ్చయమవడంతో, పెళ్లి ఖర్చుల కోసం దేవన్న తన మందలోని 30 మేకలను విక్రయించాడు. కూతురి పెళ్లి అట్టహాసంగా ముగిసింది.

అయితే, వివాహం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న దేవన్నకు ఇంటి ఆవరణలో పలచబడిన మేకల మంద కనిపించింది. ఎప్పుడూ కళకళలాడే మందలో తన కళ్లెదుటే పెరిగిన మేకలు కనిపించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

బిడ్డ పెళ్లి జరిగిందన్న సంతోషం కంటే, తన ప్రాణ సమానమైన మూగజీవాలను దూరం చేసుకున్నానన్న బాధ ఆయనను కుంగదీసింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కన్న కూతురు అత్తవారింటికి వెళ్లిన కొన్ని గంటలకే తండ్రి ఇలా విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పెంపుడు జంతువులపై ఆయనకున్న మమకారం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button