MedchalPoliticalTelangana

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు,

వ్యవసాయ అధికారి సూచన మేరకు, మంచి విత్తనం స్వీకరించాలి

మే 05 (సీ కే న్యూస్) చేగుంట

చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మంగళ వారం నాడు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం ఆధ్వర్యంలో జరుగుతున్న “రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమలో భాగంగా వ్యవసాయ ఇంజినిరింగ్ కళాశాల కంది మండలం సంగారెడ్డి బోధన సిబంది, డాక్టర్ లక్ష్మణరావు, మరియు డాక్టర్ నీమా పర్వీన్, చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామంలో అన్నదాతలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్, లక్ష్మణ్ రావు, మాట్లాడుతు, పంటలలో యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవ ఎరువులు, పశువుల పెంట వాడడం మరియు సేంద్రియ పద్ధత్తులపై వివరించడం జరిగింది. డాక్టర్, నీమా పర్వీన్, మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల జరిగే మేలు, నీటి ఆదా చేయడం మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న వరి పంటలపై చర్చించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలు మరియు కలుపు యాజమాన్యం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరీ, ఉప సర్పంచ్ నగేష్, పంచాయతీ సెక్రటరీ కృష్ణ, చేగుంట ఏఎంసి డైరెక్టర్ ముజామిల్, వార్డు మెంబెర్స్, రైతులు, విద్యార్థులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button