
బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదు
Web desc : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్పై తీవ్రమైన పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్తో పాటు మరికొన్ని చోట్ల ఈ దారుణం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భగీరధ్ వేధింపులు భరించలేక తమ కూతురు రెండు సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని వారు ఆరోపిస్తున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరధ్పై బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసులు నమోదు చేశారు. మైనర్ బాలికకు మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కేసు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు తమ కూతురిపైనే తప్పుడు కేసులు పెడుతున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
హనీ ట్రాప్ వాదనపై పెరుగుతున్న అనుమానాలు. ఈ ఘటనపై బండి సంజయ్ వర్గం స్పందిస్తూ ఇది ఒక హనీ ట్రాప్ అని వాదిస్తోంది. సాయి భగీరధ్ను బుజ్జగించి 5 కోట్లు డిమాండ్ చేశారని, అందులో భాగంగానే 50 వేల రూపాయలు చెల్లించినట్లు వారు చెబుతున్నారు.
అయితే అసలు తప్పు చేయనప్పుడు నిందితుడి తరపు వారు ఎందుకు డబ్బులు ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.




