EducationPoliticalTelangana

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడూ?

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడూ?

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడూ?

యూనిఫామ్‌లు, పుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం

విద్యాశాఖ మౌనం.. జిల్లా అధికారులు స్పందించాలని డిమాండ్

సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 04 2026: ఏన్కూరు మండలంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది ఫీజులను భారీగా పెంచుతూ, మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల కార్యకలాపాలు ప్రారంభించిన ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, పాఠశాల యాజమాన్యం సూచించిన నిర్దిష్ట దుకాణాల్లోనే యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యాపారులతో కమిషన్ ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య హక్కుగా ఉండాల్సిన సమయంలో, ప్రైవేట్ విద్య వ్యాపారంగా మారిపోయిందని పలువురు మండిపడుతున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు నియంత్రణ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే విషయంపై స్థానిక విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్మాణం, యూనిఫామ్‌లు, పుస్తకాల బలవంతపు కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button