
గిరిజన గురుకుల ప్రిన్సిపాల్, ఆర్సిఓ రత్న కుమారి లను సస్పెండ్ చేయాలని గిరిజన విద్యార్థుల భారీ ధర్నా…..!!
డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మద్దతుతో ఊపందుకున్న విద్యార్థులు — ధర్నాలో పాల్గొన్న DSFI రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్,రాష్ట్ర నాయకులు శాంతి కుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్….
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండు గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం — విద్యార్థుల అగ్రహానికి దిగి వచ్చిన ఆర్సిఓ (RCO) రత్నకుమారి
15 సార్లు వినతిపత్రం ఇస్తే రాలేదు గానీ — ధర్నా చేయంగానే ఉరుక్కుంటూ వచ్చావా అని విద్యార్థులు తిరగబడడంతో వెనుకదిరిగిన ఆర్సిఓ…
మహబూబాబాద్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూతవేటు దూరంలో గిరిజన గురుకులం — ప్రజా పాలనలో విద్యార్థుల గోసలు…..!!
మున్సిపల్ క్యాంప్ రాజకీయాల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు — మా కడుపులో బువ్వ పెట్టడానికి చేతులు రావడం లేదా…..?
మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని అడిగినందుకు తీవ్రంగా దుర్భాషలాడారు, ఆర్సీవోను సంప్రదిస్తే తాటతీస్తా అంటున్నారు
నీళ్లు లేక గుట్ట పైకి లోట పట్టుకొని బహిర్భూమికి వెళ్తున్న విద్యార్థులు
మా గోస ఎవరికి చెప్పుకోవాలంటు ఆగ్రహానికి గురై అంబేద్కర్ విద్యార్థులు విద్యార్థులు రోడ్డెక్కి భారీ ధర్నా చేశారు
ఉన్న గురుకులాల్లో సమస్యలు పరిష్కారం చేయడం చేతకాదు కానీ — ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తారట



