JagityalaPoliticalTelangana

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి..

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి..

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి..

వాంతులు, విరేచనాలు కారణంగా అస్వస్థతకు గురైన జీవన్ రెడ్డి

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కేర్ అస్పత్రికి తరలించారు.

జీవన్ రెడ్డి ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల సమయంలో రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి లోనైన సంగతి తెలిసిందే. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి వలసవాదులకు ఇవ్వడం బాధాకరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సంబురపడాలో.. బాధపడాలో అర్థం కావడం లేదని బాధపడ్డారు.

బీఆర్ఎస్ నాయకులైన వలసవాదులకు పదవులు ఇవ్వడం, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను అణచివేయడం తప్పుగా ఉందని ఆరోపించారు.

కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సమీండ్ల శ్రీనివాస్.. జనవరి 25న ఎమ్మెల్యేను కలిసి, కాంగ్రెస్‌లో చేరకుండా ”అభివృద్ధికి సహాయపడతాను” అని చెప్పుకుని పదవి పొందారని విమర్శించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైస్ చైర్మన్ గురించి తనతో మాట్లాడడం బాధాకరమని అన్నారు.

బీఆర్ఎస్ లో అవకాశాలు లేక వలసలు వచ్చి, మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకుని గెలిచిన కౌన్సిలర్లను అవమానిస్తున్నారని అన్నారు.

”వలసవాదులకు పదవులు ఇచ్చి.. వారి కింద పని చేయమంటే మా మనోభావాలు ఏమవుతాయి? ఈ అవమానాలు ఎంతకాలం భరించాలి. ఈ పదవుల పంపిణీతో నా మానసిక క్షోభ పెరిగిందని.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగాలా? అని ఆలోచిస్తున్నాను. మాకు ఈ వేధింపులు ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి’అని జీవన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button