
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు…
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పదవ తరగతి పరీక్షల బందోబస్తు విధులకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే : కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్కు చెందిన మహేష్ రెడ్డి, రాంబాబు అనే ఇద్దరు పోలీసులు బైక్పై నొస్సం గ్రామానికి బయలుదేరారు.
అక్కడ పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాల్సి ఉంది. మార్గమధ్యంలో గుళ్లదుర్తి గ్రామం వద్దకు రాగానే, వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును బలంగా ఢీకొంది.
ఆసుపత్రికి తరలింపు : ఈ ప్రమాదంలో మహేష్ రెడ్డి, రాంబాబులకు శరీరమంతటా తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


