
దళిత మహిళా సర్పంచ్ కు అవమానం..!
Web desc : భారతదేశానికి స్వాతంత్రం, రాజ్యాంగం ఏర్పడి 70 సంవత్సరాలు అవుతున్నా దళిత మహిళా సర్పంచ్ కు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది.
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం యెన్కెపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర 34వ వార్షిక మహోత్సవం ఆహ్వాన శుభపత్రిక ఓ అగ్రకులానికి చెందిన నేత కావాలని దళిత మహిళ గ్రామసర్పంచ్ స్వరూప, ఉప సర్పంచ్ రామప్ప ముదిరాజ్ ల పేర్లు కావాలని వేయలేరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాల నుండి జాతర ఆహ్వాన శుభపత్రికలో సర్పంచ్, ఉప సర్పంచ్ల పేర్లు వేసేవారు.
కానీ దళిత మహిళా సర్పంచ్ కావడంతో కావాలనే అవమానించారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు కారణమైన వారి పై ఎస్సీ అట్రాసిటీ కేసునమోదు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.



