
గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృ*తి
విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని లోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్(46) సోమవారం ఉదయం పాఠశాలకు హాజరయ్యాడు.
ఈ క్రమంలో తరగతి గదిలో గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన స్థానికులు నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.



