
ఈ గురుకులంలో అవస్థలకు అధికారులు ప్రజా ప్రతినిధులు చాలా కాలం నుండి మౌనం ఎందుకు?
తలుపులు లేని మరుడు దొడ్లు మలమూత్ర విసర్జనతో నిండి కంపు కొడుతున్న బాత్రూములు
గురుకుల పేద విద్యార్థుల కష్టాల ముగింపు ఎపుడు.
కొందుర్గ్ గురుకుల పాఠశాలలో మరి అద్వాన స్థితిలో బాత్రూమ్ లు
విద్యార్థులుకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్న ఆది స్కేత్ర స్థాయిలో మాత్రం శూన్యం..
సి కే న్యూస్ షాద్ నగర్ :జులై 7
షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంలో నీ స్థానిక గురుకుల పాఠశాల లో నేడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరియు కొందుర్గు మండల మాదిగ దండోరా అధ్యక్షులు అనేగాళ్ల ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో గురుకులం లో ప్రత్యేకంగా కలియ తిరగటం. జరిగింది
భవనంలోని నాలుగు అంతస్తులలో గల పారిశుధ్య పరిస్థితులు చాలా అధ్వానంగా పూర్తిగా చిన్న బిన్నమైన పరిస్థితులలో బాత్రూంలో పూర్తిగా మళ్ళంతో నిండిపోయిన స్థితిలో మల మూత్ర విసర్జనలో కూరుకుపోయి ఉనాయి అవి నిరుపయిగనగా తయారయ్యాయని అసలు పూర్తిగా పనిచేయటం లేదని విద్యార్థులు తెలిపారు.
స్వయాన అక్కడికి వెళ్లి చూడగా అవి చాలా దుర్గంధ స్థితిలో నిండి కంపు కొడుతూ దుర్బంధ భరితంగా ఉన్నాయి పూర్తిగా నిండిన విసర్జన శాలలు మలం మరియు మూత్రాలతో నిరుపయోగ స్థితిలో ఉనాయి.ఇక్కడ ఇంత దీన మరియు దుర్గంధ స్థితిలో ఉన్నా ఈ ప్రభుత్వ. అధికారి మాత్రం ఏ ప్రజా ప్రతినిధి శ్కేత్ర స్థాయిలో పరిశీలించకపోవటం.చాలా. అనుమానాలకు ఆద్యం పోస్తోంది.
ఈసందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొందుర్గ్ మండల అధ్యక్షులు అనేగాళ్ల ఆనంద్ మాదిగ మాట్లాడుతూ వసతి సౌకర్యాలకు విద్యార్థులకు. సరిగ్గా లేవని విద్యార్థులు మాల మూత్ర విసర్జన దుర్గంధాలతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిని చదువు అంటేనే.
విసుగు చెందే పరిస్థితికి వచ్చిందని అన్నారు.ఇది ఇలానే కొనసాగితే గురుకులం పరిస్థితిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థులకు మెరుగైన సౌకర్యకయాలుఅందించకపోతే విద్యార్థులకు అండగా రాజీలేని పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.
ఈకార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు మండల అధ్యక్షులు అనేగాళ్ల ఆనంద్ మాదిగ బైరoపల్లీ గ్రామ కమిటీ అద్యక్షులు చిన్న బొక్కి చిన్న. చంద్రయ్య.మహాదేవపూర్ రామకృష్ణ వెంకిర్యాల వెంకటేష్ రవి ఆగిర్యాల.చెన్నయ్య ఎంకేపల్లి దర్శన్ రమేష్ వెంకటయ్య రాములు జంగయ్య ఇంకా వివిధ గ్రామాల విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు..




