
పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే సమగ్ర ప్రణాళిక రూపొందించి పారిశుద్ధ్య సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు
వర్షాకాలం దృష్ట్యా ఖమ్మాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. పారిశుద్ధ్యం లోపించడం అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిచోటా చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని పువ్వాడ ఆందోళన వ్యక్తంచేశారు.




