
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..
ప్రేమ పేరుతో నమ్మించి.. న్యాయం అడిగితే పరార్!
పాల్వంచ టౌన్: ప్రేమ పేరుతో రెండేళ్లుగా నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి.. చివరకు మోసం చేశాడని యువతి కన్నీరుమున్నీరవుతోంది. తనపై లైంగిక దాడికి పాల్పడి, పెళ్లికి నిరాకరించడంతో పాటు దాడి చేశాడని ఆరోపిస్తూ పాల్వంచ మండలం కిన్నెరసాని పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన యువతి ఆందోళనకు దిగింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోడిపుంజుల గ్రామానికి చెందిన భూక్యా అభి, యువతి గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని పుల్లయ్యగూడెం పరిధిలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు.
నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు.. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పి కొట్టినట్లు ఆమె ఆరోపించింది. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే అభి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వారు తెలిపారు. అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదన్నారు.
“ప్రేమించావు.. పెళ్లి చేసుకుంటానన్నావు.. ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు?” అంటూ యువతి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తనను పెళ్లి చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువతి కుటుంబ సభ్యులతో కలిసి అభి ఇంటి ఎదుటే ధర్నాకు దిగింది. “నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ యువతి స్పష్టం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, యువతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనంలోని ఆరోపణలు యువతి, ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు, అధికారిక నిర్ధారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.




