KhammamPoliticalTelangana

ప్రభుత్వం మారిన మారని అక్రమార్కుల వైఖరి : బద్రు నాయక్

ప్రభుత్వం మారిన మారని అక్రమార్కుల వైఖరి : బద్రు నాయక్

రఘునాథ పాలెం లో లోకాయుక్తా అధికారి పర్యటన

  • పూర్వం అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ
  • అదే స్థలంలో నేషనల్ హైవేకు అనుమతి
  • గతంలో బద్రు నాయక్ ఫిర్యాదు పై అక్రమార్కులకు ఫైన్
  • అధికారుల సమన్వయ లోపం తోనే సమస్యలు

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం : మండలంలోని చింత గుర్తి, కోయ చెలక రెవెన్యూ గ్రామాల పరిధిలోని పీర్ల గుట్టను అనుమతులకు మించి అక్రమంగా తవ్వి , మట్టిని తరలించుకొని పోతున్న విషయమై వచ్చిన ఫిర్యాదు పై గతంలో నే విచారణ తలపెట్టిన లోకాయుక్త విచారణ అధికారి మ్యాత్యు కోషి బుధవారం నాడు రఘునాథపాలెం మండలంలో మరోసారి పర్యటించారు. గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉండగా , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సందర్భంగా పైన్ విధించిన ఉదంతం విధితమే .

కాగా ప్రభుత్వం మారిన మారని అక్రమార్కుల వైఖరి , అధికారుల సమన్వయ లోపం కారణంగా నేషనల్ హైవే కోసం పీర్ల గుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు పక్క దారి పడుతున్న విషయమై మరోసారి విచారణ నిర్వహించడానికి రఘునాథపాలెం మండలం లో పర్యటించి , ఆయన విచారణ చేపట్టారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ , ఏడి మైన్స్ , మండల తాసిల్దార్ , సర్వేయర్ లు వెంట రాగా లోకాయుక్త విచారణ అధికారి మ్యాత్యూకొషి విచారణ తలపెట్టారు.

స్థానిక వివిధ శాఖ అధికారులు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనుమతులు ఇచ్చారు ? అనే విషయంపై స్పష్టంగా వివరణలు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి రవాణా జరగకుండా అనుమతి ఇచ్చిన చోట కాకుండా మరోచోట త్ర వ్వకాలు జరగకుండా ,సరిహద్దులను నిర్ణయించి , చెక్ పోస్ట్ లను ను ఏర్పాటు చేయాలని తన వెంట వచ్చిన అధికారులను ఆయన సూచించారు.

ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రూ నాయక్ మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు మట్టి మాఫియాగా తయారై , ఒక చోటా అనుమతులు తీసుకొని మరోచోట అక్రమంగా మట్టిని త్రవ్వుతూ తరలించు కొని పోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా అధికారులు సమన్వయ లోపంతో మిన్న కుండి పోతున్నారని విమర్శించారు.

గతంలోనే ఫైన్ వేసినప్పటికీ , నేషనల్ హైవేకు అప్పగించిన అక్రమార్కుల వైఖరి ఏ మాత్రం మారలేదని , లోకాయుక్త తో పాటు స్థానిక మైన్స్ , సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ , తాసిల్దార్ వంటి అధికారులు దీనిపై దృష్టి సారించి , తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడి సమస్యలను పరిష్కరించకుండా కొత్తా గా అనుమతులు మంజూరు చేయకూడదని పేర్కొన్నారు .

ఇదిలా ఉండగా ఇక్కడ తమకు భూములు ఉండగా తమ భూముల్లో కూడా అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారని , సరిహద్దులను నిర్ణయించడంలో అధికారులు విఫలం చెందుతున్నారని ఫలితంగా తాము అనేక సమస్యలు ఎదుర్కోవటంతో పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులు ఖాజా అబ్దుల్ రెహమాన్ , జావిద్ పాషా , జూనెద్ పాషా , ముజా హిద్ పాషా, వహీద్ పాషా లు లోకాయుక్త విచారణ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్ , ఉపేంద్ర బాయి, డి. నాగేశ్వరరావు, షేక్.నజిమా , కిషన్ నాయక్ ,రవీందర్ నాయక్ ,వీరన్న నాయక్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!