మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బెదిరించి మా భూములను ఆక్రమించుకున్నారు
భూములు ఇప్పించకుంటే ఆత్మహత్యలే..
ఆందోళన చేస్తున్న బాధిత రైతులు
నర్సింహులగూడెం రైతుల ఆవేదన
మాజీఎమ్మెల్యే శంకర్ నాయక్ బెదిరించారని ఆందోళన
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బెది ౦చి మా భూములను ఆక్రమించుకున్నారు. ప్రభు దీ తిరిగి వాటిని అప్పగించాలి. లేదంటే సామూ -కంగా ఆత్మహత్య చేసుకుంటాం’ అని బాధిత తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదివా – మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్సెంహులగూడెం శివారులోని తమ పట్టా -ముల వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భం బాధితరైతులు పగిడిపాల వీరయ్య, పగిడిపాల ఆదీప్, పెదగాని నర్సయ్య, చిన్ననర్సయ్య రమే మెండారి గుట్టయ్య, వేణు, ఉపసర్పంచ్ రమేశ్.
గ్రామపెద్ద బండి గుట్టయ్య వివరాలు వెల్లడిం చారు. నర్సింహులగూడెం శివారులో 172/38, 172, మరికొన్ని సర్వే నంబర్లలో బోడగుట్ట చుట్టూ వందల ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములు, వెం కన్న చెరువు ఉంది.
ఈ సర్వే నంబర్లలో 20 మంది రైతులకు 50 ఎకరాల పట్టా భూములున్నాయి. మాజీఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ బెదిరించి బోడగుట్టకు ఎదురుగా మూడెకరాలు, పక్కన తొమ్మిది ఎకరాలను తక్కువ ధరకు తన బినామీల పేరుమీద కొనుగోలు చేశారని ఆరోపించారు.
గుట్టపై క్రషర్ నిర్వహించేందుకు తమ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వుతూ చెరువులో పోసి పూడుస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు.