KhammamPoliticalTelangana

48 గం,,లలో కిడ్నాప్ కేసును చేదించిన ముదిగొండ పోలీసులు

48 గం,,లలో కిడ్నాప్ కేసును చేదించిన ముదిగొండ పోలీసులు

కిడ్నాప్ ముఠా అరెస్ట్…

48 గం,,లలో చేదించిన ముదిగొండ పోలీసులు

ముదిగొండ ఇన్స్‌పెక్టర్

సికె న్యూస్ ప్రతినిధి ముదిగొండ

ముదిగొండ మండలం గంధసిరి కి చెందిన పస్తం ఏసు రాజు S/o ఏగులు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పస్తం రామరాజు @ చిన్న గురూజీ అనునతడికి ఉన్న పాత కక్ష ల నేపధ్యంలో అతడిని ఎలాగైనా సరే మనుషులను పెట్టి బెదిరించి కిడ్నాప్ చేయించి అతని దగ్గర నుండి డబ్బులు వసూలు చేయాలని పస్తం రామరాజుకు పరిచయం ఉన్న వేంకటగిరికి చెందిన దగ్గుపాటి రమాదేవి అను ఆమెను సంప్రదింఛి అడ్వాన్సు గా రమాదేవి కి రూ, 50,000/- లు ఇస్తాడు.

రమాదేవి తన అనుచరులైన కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్ లకు చెప్పగా, వారు వసికర్ల సాయి కృష్ణ, కమతం వినీత్ లను మాట్లాడుకుంటారు. వీరంతా ఒక ముఠా గా ఏర్పడి పలిమెల ప్రవీణ్ అనే కార్ డ్రైవర్ ను కార్ తీసుకు రమ్మని చెప్పి కుదుర్చుకుంటారు.

అందుకు కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్ లకు అడ్వాన్సు గా రూ, 50,000/- లు ఇచ్చి పని కాగానే అడిగినంత డబ్బు ఇస్తానని రామరాజు చెపుతాడు. పధకం ప్రకారం ఏసు రాజు యొక్క కదలికలు చెప్పటానికి తన కులస్తుడైన గంధం అంజయ్యను పెట్టుకుంటాడు.

ది.25.09.2024 న ఉదయం గంధసిరిలో కుల పంచాయతి ఉండగా దానికి పస్తం ఏసురాజు కూడా వస్తాడు. అదే రోజు రాత్రి 7 గం,,ల సమయంలో ఏసు రాజు, అంజయ్య మరియు ఇంకా కొంత మంది కలిసి కమలాపురం వెళ్లి టిఫెన్ చేసి తిరిగి కారు లో గంధసిరి వస్తుండగా పస్తం రామరాజు ముందుగానే ఏర్పాటు చేసుకున్న కిరాయి గుండాలు కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్, వసికర్ల సాయి కృష్ణ, కమతం వినీత్ లు కలిసి పలిమెల ప్రవీణ్ లు కలిసి రాత్రి 8 గం,,ల సమయంలో మావుళ్ళమ్మ గుడి దగ్గర కారు ఆపుతుండగా, వెనకాలే కారు లో వస్తున్న వ్యక్తులు, వారి కారును అడ్డం పెట్టి పస్తం ఏసు రాజు ను బలవంతంగా కార్ లో ఎక్కించుని అతడిని కొట్టుకుంటూ, గుద్దుకుంటూ ఖమ్మం కొత్త బస్సు స్టాండ్ వద్దకు తీసుకువెళ్ళినారు.

వారంతా కలిసి లక్ష రూపాయలు ఇస్తేనే వదిలి పడతాము లేదంటే చంపుతాము అని బెదిరించగా, పస్తం ఏసు రాజు భయపడి తన ఫోన్ నుండి కంచర్ల నాగేశ్వర రావు ఫోన్ కు రూ,, 60,000/- లు ఫోన్ పే ద్వారా పంపించి రెండు రోజుల తరువాత మిగతా డబ్బులు పంపిస్తానని చెప్పగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పస్తం ఏసు రాజు ను బస్సు స్టాండ్ లో వదిలి పెట్టి వెళ్ళిపోతారు.

కిడ్నాప్ పూర్తీ అయిన తరువాత రామ రాజు, రామాదేవి కి రూ,, 50,000/- లు పంపిచినాడు. మరల వీళ్ళంతా కలిసి ఏసు రాజు ను బెదిరించగా రెండు దపాలుగా రూ,, 16,500/- లు ఫోన్ పే ద్వారా పంపించినాడు.

ఇన్ని రోజులు ఏదైనా చేస్తారని భయపడి పిర్యాదు చేయలేక పోయినాడు. తేది: 08.10.2024 న పస్తం ఏసురాజు జరిగిన సంఘటన గురించి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, O. మురళి, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ముదిగొండ కేసు నమోదు దర్యాప్తును ప్రారంభించినారు.

వెంటనే రెండు పోలీస్ బృందాలన రంగం లోకి దింపి ముద్దాయిల కోసం వెదుకుతుండగా, ఈరోజు అనగా ది 10.10.2024 ముదాయిలందరూ కలిసి విజయవాడ వైపు మూడు కారు లలో వెళుతున్నారని సమాచారం మేరకు సువర్నాపురం నుండి హైవే కారులు రోడ్ ఎక్కే దగ్గర వాహనాల తనిఖీ చేస్తుండాగా,

పస్తం రామరాజు, దగ్గుపాటి రమాదేవి, కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్, వసికర్ల సాయి కృష్ణ, కమతం వినీత్, పలిమెల ప్రవీణ్, గంధం అంజయ్య అను ఎనిమిది మంది ముద్దాయిలు కారు లలో పారిపోతుడగా వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 10 సెల్ ఫోన్లు, మూడు కార్ లను స్వాధీన పరుచుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచనైనది.

ఇట్టి ముఠా గతం లో కూడా తొర్రూర్ ఏరియా లో ఇటువంటి నేరాలు చేసినారు. ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించిన యస్. ఐ. జి. నరేష్, ట్రైనీ యస్. ఐ రోహిత్ మరియు సిబ్బందిని CI అభినందించినారు. .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!