HyderabadPoliticalTelangana

ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి..

ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి..

ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేస్కి సంబంధించి ఈడీ విచారణకు సినీ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఇవాళ బుధవారం (ఆగస్టు 13న) విచారణలో భాగంగా మంచు లక్ష్మీ ఈడీ కార్యాలయానికి చేరుకుంది.

ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ పలు గేమింగ్‌ యాప్‌లను సోషల్‌ మీడియాలో మంచు లక్ష్మీ ప్రమోట్‌ చేసింది. ఈ క్రమంలో మంచు లక్ష్మీ తన బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు తీసుకుని రావాలని ఈడీ కోరింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద మంచు లక్ష్మీ ఇచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్ లపై అరా తియ్యనుంది ఈడీ..

చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది..? అనే కోణంలో ఈడీ విచారించనుంది. మరి మంచు లక్ష్మీని ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయనుందో అనే ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే, ఇదే కేసులో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్‌ రాజ్‌ హాజరైన విషయం తెలిసిందే. ప్రకాశ్‌ రాజ్‌ను 6 గంటలు, విజయ్‌ దేవరకొండను 4 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button