MuluguPoliticalTelangana

మర్రి మాకు వాగులో మహిళ మృతదేహం లభ్యం...

మర్రి మాకు వాగులో మహిళ మృతదేహం లభ్యం...

మర్రి మాకు వాగులో మహిళ మృతదేహం లభ్యం.

పేరూరు పోలీసుల దర్యాప్తు .

సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్

ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామ సమీపంలో మర్రి మాకు వాగులో నీటిపై తేలియాడే గుర్తుతెలియని మహిళ మృతదేహం ను ఆదివారం సాయంత్రం కనుగొన్నారు.

ఈ విషయాన్ని పేరూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, మృతదేహాన్ని వాగు నుండి వెలికి తీశారు.మృతి చెందిన మహిళకు సుమారు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయనిఅంచనా.

ఇటీవల గోదావరి వరదలు, భారీ వర్షాలు కారణంగా వృద్ధురాలు ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ విషయంపై పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ ను ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధులు వివరణ కోరగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం అని మృతురాలి వివరాలు ఈ విధంగా తెలియజేశారు .

ఆమె పేరు కంతి లక్ష్మి వయస్సు 60 సంవత్సరాలు,కులం కోయ, వెంకటాపురం ఎదిరా గ్రామస్తురాలు, కంతి లక్ష్మి తమ చెల్లెలు అయినా చెందురు. బతుకమ్మ (కృష్ణాపురం) వారి ఇంటికి రావడం జరిగింది. ప్రమాదవశత్తు నీళ్లలో పడిపోయింది అని వివరాలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button