BhadrachalamPoliticalTelangana

గాంధీనగర్ లో కార్డెన్ సర్చ్…

గాంధీనగర్ లో కార్డెన్ సర్చ్…

గాంధీనగర్ లో కార్డెన్ సర్చ్…

జిల్లా ఎస్పీ ఆదేశాలతో పాల్వంచ డిఎస్పి సీఐ సారాద్యంలో…

బూర్గంపాడు ఎస్ఐ రాజేష్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలో గాంధీనగర్ లో కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న డిఎస్పి సతీష్ కుమార్, సీఐ వినయ్ కుమార్, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, పలువురు ఎస్ఐలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది.

పాల్వంచ డిఎస్పి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిస కావొద్దు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు, అనుమానిత వ్యక్తులు కనబడితే డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్ వద్ద సమాచారం ఇవ్వండి.

సమాచారం ఇచ్చిన వారు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి డీఎస్పీ సతీష్ కుమార్ చెప్పడం జరిగింది.

పాల్వంచ సీఐ వినయ్ మాట్లాడుతూ సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియపరచాలని. సీఐ వినయ్ కుమార్ అన్నారు.

కార్డెన్ సెర్చ్ లో పలు ద్విచక్ర వాహనాలు అదుపులోకి తీసుకొని సరైన పేపర్స్ లేని వాహనాలను బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్, కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ విజయ, ములకలపల్లి ఎస్ఐ రాజశేఖర్, పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్, డాగ్ స్క్యాడ్ అధికారులు, ఏఎస్ఐలు మరియు మహిళ ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button