Andhra Pradesh

ఆ జిల్లాలో మావోయిస్టుల కదలికలు

ఆ జిల్లాలో మావోయిస్టుల కదలికలు

ఆదిలాబాద్ జిల్లా :
ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి.

నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో శనివారం లేఖలు కనిపించాయి.

మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి.

మావోయిస్టు నేత భాస్కర్, సికాస ప్రభాత్ పేరుతో ఈ లేఖలు కనిపించాయి. ఇక, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని,ఎమ్మెల్యే అనుచరులు సహాయం కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆ లేఖలో మావోలు పేర్కొన్నారు.

ఇక, ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరుడు హాజీపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నాడని.. అలాగే, ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను తెప్పించి యువతను నాశనం చేస్తున్నారని,

వారి ద్వారా భూమి కబ్జాలు చేస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే, ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల దీన స్థితి, దాని కోసం వచ్చే ప్రభుత్వ నిధుల దారి మళ్లింపులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అలాగే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

అలాగే, ఖానాపూర్, నిర్మల్, ముధోల్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఈ లేఖలు కలకలం రేపుతున్నాయి. అవి మావోలే విడుదల చేశారా.. లేఖ గిట్టని వారి పనా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button