
20 పేజీల సూసైడ్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య!
20 పేజీల సూసైడ్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య. జనగామ పూర్ణిమ కాలనీలో కలకలం విశ్రాంత ఉపాధ్యాయుడు 20 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
చనిపోయే ముందు తన చావుకు కారణమైన వారి పేర్లతో మల్లయ్య సూసైడ్ నోట్ రాశారు. మొత్తం 33 పేజీల సూసైడ్ నోట్ను రాసి చనిపోయారు. రిటైర్డ్ టీచర్ రాసిన నోట్లో బావమర్దులు గుంటి రత్నాకర్, మనోహర్ పేర్లు ఉన్నాయి.
వీరిద్దరి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మల్లయ్య లెటర్లో రాశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మల్లయ్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగనుంది. మల్లయ్య మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.




