
తెలంగాణలో అమ్మకానికి గురుకులాల సీట్లు
ఖాళీ సీట్లను దళారుల ద్వారా విక్రయిస్తున్న అధికారులు
గురుకుల సొసైటీల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో, నెలన్నరగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
జిల్లాల స్థాయిలో సరైన సమాచారం లేకపోవడంతో, అనేక జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లోని గురుకుల ప్రధాన కార్యాలయం ఎదుట సీటు కోసం తల్లిదండ్రుల పడిగాపులు
అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడకుండా, వారిని లోపలికి కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు
ఈ నేపథ్యంలోనే అధికారులు కొందరు దళారులను ఏర్పాటు చేసుకుని ఒక్కో గురుకుల సీటుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రేటు కట్టి వసూళ్లు చేస్తున్నారని చెప్తున్న తల్లిదండ్రులు
పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ వద్ద డబ్బులు వసూలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు




