
పంచాయతీ కార్యదర్శిపై కాంగ్రెస్ సర్పంచ్ భర్త దాడి
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి రంగయ్యపై కుర్చీ ఎత్తి దాడి చేసి, బూతులు తిట్టిన కాంగ్రెస్ సర్పంచ్ సంతోషమ్మ భర్త సాయిలు
గడ్డి మందు పిచికారీ విషయంలో తలెత్తిన గొడవలో, పంచాయతీ కార్యాలయంలో గంటల పాటు హంగామా చేసి, తనపై సాయిలు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన రంగయ్య
రంగయ్యపై తిరిగి ఫిర్యాదు చేసిన సాయిలు
ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
web desc : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో తాళం చెవి విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శి నక్కబాల వెంకటరంగయ్యపై దాడికి ప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయ తాళం చెవి విషయమై కార్యదర్శి, సర్పంచ్ భర్త సాయిలు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో తనపై కుర్చీతో దాడికి యత్నించారని కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాళం చెవి కోసం మొదలై.. ఉద్రిక్తతకు దారి… పంచాయతీ కార్యాలయ తాళం చెవి విషయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మారింది. దీంతో కార్యదర్శి పోలీసులను ఆశ్రయించి తనపై దాడికి యత్నించినట్లు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు… కార్యదర్శి ఫిర్యాదు మేరకు కల్హేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన సమయంలో అక్కడ ఏం జరిగింది? దాడికి యత్నం జరిగిందా? వివాదానికి అసలు కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు విచారణ జరిపారు.
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది. ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం.. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి యత్నించారనే ఆరోపణలను పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించేలా అధికారులు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కల్హేర్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ, సీఐలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఎక్కడ?… గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందించే పంచాయతీ కార్యదర్శులు ఒత్తిళ్లు, వివాదాల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తే పాలనపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.
విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులు, బెదిరింపులకు తావులేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు కోరారు. బీబీపేట ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి అసలు నిజాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులు ఎవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




